మిత్రులందరికీ నమస్కారం🙏🙏🙏
మీకందరికీ ఒక విషయం తెలుసు రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్ లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలు ఉంది అందులో భాగంగా 40 శాతం వరకు కమ్యూట్ చేయొచ్చు. కమ్యూట్ చేసిన దానికి కొంత మొత్తాన్ని ఏక మొత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన అమౌంట్ని అసలు పెన్షన్ నుండి తగ్గించి, 15 సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్ లో కలుపుతారు. ఇది ఆనవాయితి. అయితే 2010 పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఈ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ పెన్షన్ కమ్యూట్ని తగ్గించారు. ఉదాహరణకు 2010 ఫ జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమ్యూట్ చేసేస్తే వాళ్లకు 10.46×12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చేది అంటే ఒక రూపాయి కమ్మ్యుట్ చేస్తే 125 రూపాయలు commuted value వచ్చేది.
తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ commuted value ని తగ్గించి 8.371×12 అంటే ఒక రూపాయి commuted value ₹100.452 వాల్యూగా నిర్ణయించింది. ఇక్కడ ఒక విషయం అందరు గమనించాలి. జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి commuted value (10.46×12)=125.52 రూపాయలు commute చేసినప్పుడు దాన్ని 15 సంవత్సరాల్లో రాబట్టేది. ఇప్పుడు అనగా 01.02.2010 తరువాత రిటైర్ అయిన వారికి commuted value (8.371X12)=100.452 గా నిర్ణయించ బడింది.
ఉదహరణ:
ఒక ఉద్యోగి 31-01-2010 నాడు రిటైర్మెంట్ పొంది Rs.10000 లను commute చేస్తే అతనికి రూ. 1000×125.52= 1,25,520/- ,లను ఏక మొత్తంగ చెల్లించి బేసిక్ pension నుండి
ప్రతి నెల 1000/- లను 15 సం. వరకు మినహాయించేవారు.
28-02-2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగి 1000 commute చేస్తే అతనికి (1000×8.371×12)= 1,00,452/- లు మాత్రమే చెల్లిస్తారు. Commuted value తగ్గింది కాబట్టి restoration period కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి.
కానీ అలా లేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల వరకు దాని మినాహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకు 1,25520/- లను 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తే,1,00,452,/- లను ఎంత కాలం అంటే మనం మ్యాథమెటిక్స్ లో చూస్తే అది 12 సంవత్సరాలకే వస్తుంది .
Rs.1,25,520/- లను 15 సం. అయితే
Rs.1,00,452/- లను ఎంత కాలం లో మినాహాయించాలి?
100452/1,25,520×15= 12సం.
కాబట్టి 12 సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్ ని మళ్లీ పెన్షన్ లో కలిపి పూర్తి pension పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు సంవత్సరాలు అనవసరంగా నష్టపోవుచున్నాము. మూడు సంవత్సరాలది మనం పెన్షన్ మీద అదనంగా ప్రభుత్వానికి అన్యాయంగా చెల్లిస్తున్నాం కాబట్టి ఈ విషయంలో చాలా ప్రతిపాదనలను పంపించింది, ప్రభుత్వం దగ్గర సరైన ప్రతిపాదన లేదు వారి దగ్గర వారు ప్రతిపాదన బ్యాంకు రేట్లు తగ్గిన ఇంట్రెస్ట్ తగ్గింది జీవన ప్రమాణం పెరిగింది ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు కానీ నిజంగా జరిగింది ఏందంటే ఆడ వేల్యూ తగ్గింది. కమ్యూటేషన్ వ్యాల్యూ ఒక 125 నుంచి ఒక 100 కుదిరించబడింది. కాబట్టి 125 రూపాయలను 15 సంవత్సరాలలో రాబడితే 100 రూపాయలు ఎంత కాలంలో రాబట్టాలని సాధారణమైన లాజిక్ ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాల్లో దాని పునరుద్ధరించడానికి ప్రతిపాదన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను లేకుంటే అందరు మూడు సంవత్సరాలు అదనంగా చెల్లించవలసి వస్తది ఆది తీవ్రమైన నష్టాన్ని దారితీస్తుంది అందరికి తెలిసిన ఈ విషయాన్ని గమనించి మీరు మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకొచ్చేసి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.
For any queries (or) suggestions regarding above topic, please tell us through below comment session.
Leave a Reply